Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి...?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (12:03 IST)
మనిషిని చూడగానే ఆకట్టుకునేది ముఖమే. అలాంటి ముఖచర్మం అందంగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు బ్యూటీ నిపుణులు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఈ కింది చిట్కాలు ఎంతగానో సహాయపడుతాయి. మరి అవేంటో చూద్దాం..
 
1. శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖ చర్మంపై టాన్‌పోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
2. ఉల్లిరసంలో స్పూన్ ముల్తానీమట్టి, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దాంతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
 
3. నిమ్మరసంలో ఆల్మండ్ ఆయిల్, సముద్రపు ఉప్పును కలిపి అందులో దూదిని ముంచి ముఖంపై గుండ్రంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మంపై మృతకణాలు పోతాయి. దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
4. టమోటాలోని యాంటీఆక్సిడెంట్స్ గుణాలు ముడతల చర్మాన్ని తొలగిస్తాయి. రెండుపెద్ద టమోటాలను మెత్తటి గుజ్జులా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు పడవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments