Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి...?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (12:03 IST)
మనిషిని చూడగానే ఆకట్టుకునేది ముఖమే. అలాంటి ముఖచర్మం అందంగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు బ్యూటీ నిపుణులు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఈ కింది చిట్కాలు ఎంతగానో సహాయపడుతాయి. మరి అవేంటో చూద్దాం..
 
1. శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖ చర్మంపై టాన్‌పోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
2. ఉల్లిరసంలో స్పూన్ ముల్తానీమట్టి, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దాంతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
 
3. నిమ్మరసంలో ఆల్మండ్ ఆయిల్, సముద్రపు ఉప్పును కలిపి అందులో దూదిని ముంచి ముఖంపై గుండ్రంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మంపై మృతకణాలు పోతాయి. దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
4. టమోటాలోని యాంటీఆక్సిడెంట్స్ గుణాలు ముడతల చర్మాన్ని తొలగిస్తాయి. రెండుపెద్ద టమోటాలను మెత్తటి గుజ్జులా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు పడవు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments