Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపిల్ తొక్క ప్యాక్‌తో కలిగే లాభాలు..?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (11:29 IST)
చర్మం ఎంత అందంగా ఉన్నా కొన్ని కారణాల వలన ఆ అందం కాస్తి కాంతిహీనతంగా మారుతుంది. కొందరైతే దానికి తోడుగా తలకు నూనెను విపరీతంగా రాసుకుంటుంటారు.. దానివలనే ముఖం జిడ్డు జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డును తొలగించడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. వాటిని వాడడం వలన చర్మం ఇంకా జిడ్డుగా మారుతుందే కానీ.. ఎలాంటి తేడా కనిపించలేదని బాధపడుతుంటారు.. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే చాలు...
 
1. ముల్తానీ మట్టి మార్కెట్‌లో దొరికే పదార్థమే కాబట్టి దీనిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.. మూల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మంపై గల జిడ్డు తొలగిపోయి తాజాగా మారుతుంది.
 
2. ఓట్స్ ఆరోగ్యానికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. మరి అందానికి ఎలానో చూద్దాం.. ఓట్స్‌ను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొన కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
3. చాలామంది ఆపిల్ తీనేటప్పుడు దాని తొక్కను పారేస్తుంటారు. ఆపిల్ తొక్కలోని ప్రయోజనాలు తెలుసుకుంటే ఆ పొట్టును పారేయరు.. ముఖంపై మెుటిమలు తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్స్‌కు వెళ్తుంటారు. ఈ చిన్న విషయానికే పార్లర్‌కు వెళ్లవలసిన అవసరం లేదని చెప్తున్నారు.. ఎందుకంటే వాటిని తొలగించే శక్తి ఆపిల్‌లో అధికంగా ఉందని చెప్తున్నారు. మరి ఎలానో తెలుసుకుందాం..
 
4. ఆపిల్ తొక్కలను మెత్తని పేస్ట్‌లా చేసి అందులో 2 స్పూన్స్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అది బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే మెుటిమలు పోతాయి. 
 
5. కంటి కిందటి నల్లటి వలయాలు తొలగించాలంటే.. టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ గుజ్జులో కొద్దిగా మెంతిపొడి, పెరుగు, కీరదోస రసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.     

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

Coronavirus: బాలీవుడ్ నటి నికితా దత్తాకు కరోనా పాజిటివ్.. హలో చెప్పడానికి వచ్చిందట!

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments