బ్యూటీ టిప్స్.. పుదీనాతో ఫేస్ ప్యాక్ ఎలా..? (Video)

పసుపు, పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా చేసి.. పసుపు అరస్పూన్ కలిపి.. ముఖానికి పూతలా వేసుకోవాలి. ప్యాక్ వేసేముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవా

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (13:34 IST)
పసుపు, పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా చేసి.. పసుపు అరస్పూన్ కలిపి.. ముఖానికి పూతలా వేసుకోవాలి. ప్యాక్ వేసేముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆపై ఈ పేస్టుతో ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సోయాబీన్‌ను మెత్తగా రుబ్బుకుని పచ్చిపాలను కలిపి ముఖానికి రాస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
ఇంకా నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శెనగపిండి, నెయ్యి, పసుపు కలిపి పేస్టులా తయారు చేసి చర్మంపై రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మృదువుగా గుండ్రంగా మసాజ్ చేయాలి ఇలా చేయడం ద్వారా పొడిబారిన చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. ప్రతిరోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి... రోజూ ఈ టిప్స్ పాటిస్తే చర్మం తాజాగా వుంటుంది. 
 
కలబంద గుజ్జులో కొంచెం పసుపు, తేనె, మీగడతో పాటు గులాబీ రసం కలిపి మిశ్రమం చేసి.. ఆ పేస్టును ముఖానికి పూతలా వేసి పావు గంట తర్వాత కడిగేస్తే మచ్చలు, కాలిన గాయాలు, మొటిమల తాలూకు మచ్చలుపోతాయి. కలబంద గుజ్జులో కొంచెం గులాబీ రసం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా వుంటుంది.

కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులపై రాసుకుంటే నలుపుదనం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా

పెళ్లైనా మరో యువకుడితో కుమార్తె: శ్రీకాకుళం తీసుకెళ్లి చంపేసిన తల్లి, తాతయ్య, వీడియో

మమతా బెనర్జీకి అల్టిమేటం జారీ చేసిన టీఎంసీ ఎంపీ

మామిడి కాయ తినాలంటే భయమేస్తుందంటున్న కేంద్ర మంత్రి.. ఎందుకు.. ఎవరు?

వైకాపా ప్రభుత్వంలో రెచ్చిపోయిన తురకా రమేష్‌పై నకిలీ పట్టా కేసు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sailaja Reddy: అమ్మా..నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రం టీజర్ రిలీజ్

Peddi Collections: పెద్ది మొదటి వారానికి ఓజీ, మహావతార్ నరసింహ కంటే వెనుకబడిందా ?

రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు : హైకోర్టులో ఆర్తి పిటిషన్

రామ్ చరణ్‌కి మైనర్ సర్జరీ.. మూడు నెలల పాటు సినిమాలకు బ్రేక్

Rajamouli: సింగ్ గీతం కథ 30ఏళ్ళనాడు కీరవాణి ద్వారా విన్నా : ఎస్.ఎస్. రాజమౌళి

తర్వాతి కథనం
Show comments