Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్య చిట్కాలు.. ఉప్పు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే?

ఒక స్పూన్ ఉప్పులో చెంచా రోజ్ వాటర్ కలిపి, అది కరిగిన వెంటనే ముఖానికి రాసుకోవాలి. మునివేళ్ళతో మెల్లిగా రెండు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై గల మృతకణాలు తగ్గిపోతాయి.

Webdunia
బుధవారం, 9 మే 2018 (15:47 IST)
సరైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను పాటించడం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. సహజమైన సౌందర్య చిట్కాలను వాడటం వలన మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ చిట్కాలేంటో చూద్దాం.
 
అర చెంచా ముల్తానీ మట్టిలో అరచెంచా పాలపొడి, గులాబీ రేకుల మిశ్రమం, దానిమ్మ రసం చెంచా చొప్పున, చిటికెడు పసుపు కలిపి ముఖానికి వేసుకోవాలి. పది నిమిషాలయ్యాక పాలని కాచి చల్లార్చిన తర్వాత అందులో దూదిని ముంచి ముఖంపై అద్దినట్లు చేయాలి. మర్దన చేస్తూ పూతను తొలగించుకోవాలి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. 
 
ఒక స్పూన్ ఉప్పులో చెంచా రోజ్ వాటర్ కలిపి, అది కరిగిన వెంటనే ముఖానికి రాసుకోవాలి. మునివేళ్ళతో మెల్లిగా రెండు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై గల మృతకణాలు తగ్గిపోతాయి. 
 
కీరదోసకి చర్మాన్ని మృదువుగా చేసే గుణం ఉంది. చిన్న కీరదోస ముక్కల్ని పేస్టు చేసుకోవాలి. తరువాత అందులో కొన్ని చుక్కలు రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకుంటే మీ ముఖం అందంగా కనిపిస్తుంది.
 
కోడిగుడ్డులోని తెల్లని సొనను బాగా నురగవచ్చే వరకు కలిపి ఒక స్పూను తేనె, స్పూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత వేడినీళ్లతో కడిగితే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
శెనగపిండిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరాక కడిగేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. స్నానానికి వెళ్లేందుకు ముందుగా పచ్చి పసుపు పాల మీగడ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తరువాత స్నానం చేస్తుంటే క్రమేణా చర్మం తెల్లబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments