కాఫీ పొడిలో కొబ్బరి నూనె కలిపి..?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (17:27 IST)
ఈ కాలంలో చాలామందికి ముఖంపై మొటిమలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఈ మొటిమ సమస్యను తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. ఒక్కసారి లేదా రెండుసార్లు అవి బాగా పనిచేస్తాయి. మరి తరువాత సంగతేంటి.. ఎల్లప్పుడూ ఆ క్రీమ్స్ వాడలేం కదా. అందుకు ఇంట్లోని సహజసిద్ధమైన ఈ చిన్న పాటి చిట్కాలు పాటించి చూడండి... తప్పక ఫలితం ఉంటుంది.
 
రెండు బాదం పప్పులను తీసుకుని వాటిని సన్నని మంటపై కాల్చుకోవాలి. ఆపై ఓ చిన్న గిన్నె తీసుకుని అందులో కాల్చిన బాదం పప్పులు వేసి మెత్తని పొడిలా చేసుకుని అందులో స్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆపై ఈ మిశ్రమాన్ని మొటిమలున్న ప్రాంతాల్లో రాసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రం కడుక్కోవాలి. ఇలా వారం పాటు క్రమంగా చేస్తే ముఖంపై గల మొటిమలు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
అలానే కొందరికి చర్మమంతా జిడ్డు జిడ్డుగా పొడిబారినట్టు ఉంటుంది. అలాంటి చర్మాన్ని మృదువుగా చేయాలంటే.. కప్పు కాఫీ పొడిలో 2 స్పూన్ల కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు, కాళ్లకు రాసుకుని గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ambati Rambabu: చంద్రబాబుపై కామెంట్లు.. అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు (video)

5555: కుప్పంలో గిన్నిస్ రికార్డ్.. జగన్ సెటైర్లకు చంద్రబాబు అలా చెక్ పెట్టారు.. ఈ-సైకిల్‌పై జర్నీ

హరిప్రసాద్ రెడ్డి అందుకే వచ్చారు, 5 ఏళ్ల క్రితమే విడాకులకు అప్లై చేసా: సర్పంచ్ గణపతి భార్య వీడియో

కేఏడీఏ భాగస్వామ్యంతో కుప్పంలో యువతకు శిక్షణా కేంద్రంను ఏర్పాటుచేసిన హిందాల్కో

Ambati Rambabu: అంబటి రెండు చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments