Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటిపై తేనె రాసుకుంటే ఏమవుతుంది?

Webdunia
శనివారం, 27 జులై 2019 (21:27 IST)
ప్రస్తుతకాలంలో చాలామంది మొటిమల సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. వాటిని నివారించుకోవడానికి పలురకాల క్రీంలు వాడినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా సహజసిద్దమైన కొన్ని పదార్దాలను ఉపయోగించి ఈ సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. ముఖం మీద మొటిమలు కనిపించగానే తేనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేనె యాంటీసెప్టిక్‌గా పని చేసి మొటిమల్ని త్వరగా తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు తెస్తుంది. అంతేకాకుండా చర్మంపై బ్యాక్టీరియా చేరి మొటిమలు రాకుండా నివారించడంలో కూడా తేనె త్వరితంగా పని చేస్తుంది. ఎలాంటి చర్మానికైనా తేనె సరిపడుతుంది.
 
2. ఈ సమస్యకు గుడ్డు తెల్లసొన బాగా పని చేస్తుంది. తెల్లసొనను ముఖంపై రాసుకోవడం వలన మొటిమలు రాకుండా నివారించడమే కాకుండా చర్మం మృదువుగా అవుతుంది. జిడ్డును నివారించడానికి కూడా గుడ్డు తెల్లసొనను మించింది ఏమీ లేదు.
 
3. కలబంద చర్మంపై జిడ్డును అదుపు చేసి మృత కణాలను తొలగించి కొత్త కణాలను ఏర్పరుస్తుంది. అందుకని కలబంద గుజ్జును ముఖానికి రాసుకోవడం వలన మొటిమలు తగ్గడమే కాకుండా వాటి తాలూకూ మచ్చలను కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా కలబంద గుజ్జులో పసుపు కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి కలబంద గుజ్జు రాసుకుని ఆరిన తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన మొటిమలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments