Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో దేశంలోనే తొలిసారి డాల్ఫిన్ల సంరక్షణా కేంద్రం

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (19:07 IST)
దేశంలోనే తొలిసారి డాల్ఫిన్ల సంరక్షణా కేంద్రాన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. గంగా నదిలో ఉన్న డాల్ఫిన్లను సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ జరిగిన సమావేశంలో ఆ రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు వార్డెన్ అజామ్‌ జాయిదీ మాట్లాడుతూ 'గంగానది పశ్చిమ బంగాలో సుందర్‌బన్స్‌ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుందన్నారు. ఈ ప్రాంతమంతా అటవీ ప్రాంతమే కాకుండా టైగర్‌ రిజర్వ్‌ కూడా అని చెప్పారు. ఆ ప్రాంతంలో గంగా నదిని డాల్ఫిన్స్‌ రిజర్వ్‌గా ప్రకటిస్తామని చెప్పారు. 
 
అలాగే డాల్ఫిన్లను చంపకుండా ఉండేందుకు మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామని, అలాగని వారి హక్కుల్ని తాము హరించబోమని ఆయన తెలిపారు. మన దేశంలో ఇప్పుడు డాల్ఫిన్ల సంఖ్య రెండు వేల లోపే ఉందని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Show comments