హర్యానాలో ఏనుగుల పునరావాస కేంద్రం

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2007 (16:27 IST)
FileFILE
దేశంలోనే తొలి ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఛాఛ్‌రౌలీలోని బన్‌సంతూర్‌లో హర్యానా అటవీ మరియు పర్యావర ణ శాఖల మంత్రి కిరణ్ చౌదరి ప్రారంభించారు. థాయ్‌ల్యాండ్‌లోని పునరావాస కేంద్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో 90 లక్షల రూపాయల వ్యయంతో కేంద్రాన్ని నిర్మించారు. వచ్చే సంవత్సరం మార్చి మాసాంతానికి పునరావాస కేంద్రం పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలను మొదలుపెడుతుంది.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గాయపడిన, అనారోగ్యం పాలైన ఏనుగులకు పునరావాస కేంద్రంలో తగు వైద్య చికిత్సలు చేపడతామని అన్నారు. దట్టమైన వెదురుపొదలకు అలవాలమైన బన్‌సంతూర్ ప్రాంతం ఏనుగులు సహజ సిద్ధంగా తిరుగాడే ప్రాంతం. ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటులో భాగంగా 50 ఎకరాల అటవీ భూములను కేటాయించారు.

కేంద్రానికి తరలించబడే ఏనుగుల సంఖ్యను అనుసరించి కేంద్రం విస్తీర్ణాన్నిపెంచే అవకాశం ఉంది. తొలిదశలో ఐదు షెడ్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క షెడ్‌లో రెండు ఏనుగులకు పునరావాసం కల్పిస్తారు. పునరావాస చర్యలను చేపట్టడంలో అనుభవం గడించి ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 'వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్' ప్రభుత్వేతర సంస్ధకు ఏనుగుల పునరావాస కేంద్రం నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని ఆమె వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధి అదుర్స్.. క్యూ2లో రాష్ట్రం జీఎస్డీపీలో 11.28 శాతం పెరుగుదల.. చంద్రబాబు

Jagan: జగన్ కడప బిడ్డా లేక కర్ణాటక బిడ్డా: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్న

పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్ల ప్రాజెక్టులు.. ప్రతిపాదనలతో సిద్ధం కండి..

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

Show comments