Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో ఏనుగుల పునరావాస కేంద్రం

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2007 (16:27 IST)
FileFILE
దేశంలోనే తొలి ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఛాఛ్‌రౌలీలోని బన్‌సంతూర్‌లో హర్యానా అటవీ మరియు పర్యావర ణ శాఖల మంత్రి కిరణ్ చౌదరి ప్రారంభించారు. థాయ్‌ల్యాండ్‌లోని పునరావాస కేంద్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో 90 లక్షల రూపాయల వ్యయంతో కేంద్రాన్ని నిర్మించారు. వచ్చే సంవత్సరం మార్చి మాసాంతానికి పునరావాస కేంద్రం పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలను మొదలుపెడుతుంది.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గాయపడిన, అనారోగ్యం పాలైన ఏనుగులకు పునరావాస కేంద్రంలో తగు వైద్య చికిత్సలు చేపడతామని అన్నారు. దట్టమైన వెదురుపొదలకు అలవాలమైన బన్‌సంతూర్ ప్రాంతం ఏనుగులు సహజ సిద్ధంగా తిరుగాడే ప్రాంతం. ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటులో భాగంగా 50 ఎకరాల అటవీ భూములను కేటాయించారు.

కేంద్రానికి తరలించబడే ఏనుగుల సంఖ్యను అనుసరించి కేంద్రం విస్తీర్ణాన్నిపెంచే అవకాశం ఉంది. తొలిదశలో ఐదు షెడ్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క షెడ్‌లో రెండు ఏనుగులకు పునరావాసం కల్పిస్తారు. పునరావాస చర్యలను చేపట్టడంలో అనుభవం గడించి ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 'వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్' ప్రభుత్వేతర సంస్ధకు ఏనుగుల పునరావాస కేంద్రం నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని ఆమె వెల్లడించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments