Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గుముఖం పడుతున్న పులుల సంఖ్య

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2007 (16:07 IST)
FileFILE
కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు వెలువరించిన నివేదికలను అనుసరించి రాష్ట్రంలో పులుల సంఖ్య తగ్గుముఖం పట్టడం పట్ల మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి కున్వర్ విజయ్ షా ఆందోళన వ్యక్తం చేశారు. పులుల పరిరక్షణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని మంత్రి మీడియాతో అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో జింకలు, నెమళ్ళు మరియు ఇతర వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు.

రాష్ట్ర రాజధానిలో సోమవారం జరిగే సమీక్షా సమావేశంలో ప్రణాళిక విధివిధానాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. వ్యనప్రాణుల సంరక్షణ నిమిత్తం అటవీ రక్షకులకు తగు మార్గదర్శకాలను అందిస్తామని కున్వర్ విజయ్ షా వెల్లడించారు. జాతీయ పక్షిగా వాసికెక్కిన నెమలి సంరక్షణార్ధం అడవులలో అవసరమైన ఆహారధాన్యాలు మరియు నీటి లభ్యతపై తమ శాఖ తగు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

రాష్ట్రంలో అటవీప్రాంత విస్తీర్ణం పెరుగుదల యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసే ప్రచార కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. తగ్గిపోతున్న అటవీ ప్రాంత విస్తీర్ణం, నానాటికి పెరిగిపోతున్న మానవ జనాభాతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఇంధన కొరత తలెత్తుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments