Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ జిల్లా: అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీక్, భయంతో పరుగులు తీసిన జనం

Webdunia
సోమవారం, 24 మే 2021 (11:15 IST)
విశాఖ జిల్లాలోని ఒక అమ్మోనియా కంపెనీలో ఆదివారం(మే 23) రాత్రి గ్యాస్ లీక్ కావడంతో జనం భయపడిపోయారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలోని భరణికం గ్రామ పరిధిలో ఉన్న అనన్య అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీకయ్యింది. ట్యాంకర్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో గ్యాస్ పైప్ లైన్ లీకైంది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

 
గ్యాస్ లీకవడం వల్ల కళ్ళు మంటలు, శరీరంపై మంటగా అనిపించినట్లు స్థానికులు చెప్పారు. గ్యాస్ లీకవడంతో ఆందోళనకు గురైన గ్రామస్థులు అనన్య కంపెనీని మూసివేయాలని ధర్నా చేపట్టారు. ఆ సమయానికి కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో, దీనిపై పోలీసులతో చర్చించిన గ్రామస్థులు తిరిగి వెళ్లిపోయారు.

 
రాత్రి చీకట్లో ఏం జరుగుతోందో అర్థం కాకపోవడంతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఇది కూడా ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలానే, మారుతుందేమోనని కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments