Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ జిల్లా: అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీక్, భయంతో పరుగులు తీసిన జనం

Webdunia
సోమవారం, 24 మే 2021 (11:15 IST)
విశాఖ జిల్లాలోని ఒక అమ్మోనియా కంపెనీలో ఆదివారం(మే 23) రాత్రి గ్యాస్ లీక్ కావడంతో జనం భయపడిపోయారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలోని భరణికం గ్రామ పరిధిలో ఉన్న అనన్య అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీకయ్యింది. ట్యాంకర్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో గ్యాస్ పైప్ లైన్ లీకైంది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

 
గ్యాస్ లీకవడం వల్ల కళ్ళు మంటలు, శరీరంపై మంటగా అనిపించినట్లు స్థానికులు చెప్పారు. గ్యాస్ లీకవడంతో ఆందోళనకు గురైన గ్రామస్థులు అనన్య కంపెనీని మూసివేయాలని ధర్నా చేపట్టారు. ఆ సమయానికి కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో, దీనిపై పోలీసులతో చర్చించిన గ్రామస్థులు తిరిగి వెళ్లిపోయారు.

 
రాత్రి చీకట్లో ఏం జరుగుతోందో అర్థం కాకపోవడంతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఇది కూడా ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలానే, మారుతుందేమోనని కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments