Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పీపీఈ కిట్ ధరించి రూ. 13 కోట్ల విలువైన బంగారం చోరీ - ప్రెస్‌ రివ్యూ

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (14:59 IST)
దేశ రాజధాని దిల్లీలో పీపీఈ కిట్‌ను ధరించిన ఓ వ్యక్తి బంగారం షాపులో చొరబడి రూ.13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది. కరోనాపై పోరులో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది పీపీఈ కిట్లను ధరిస్తారు. అయితే ఈ కిట్‌ను చోరకళలోనూ వాడేందుకు ప్రయత్నించాడో దొంగ.
 
తానెవరో గుర్తించకుండా ఉండేందుకు పీపీఈ కిట్‌ ధరించి ఓ జువెలరీ షొరూంలోకి చొరబడ్డాడు. దాదాపు 25 కిలోల బంగారు నగలను తస్కరించి ఉడాయించాడు. కర్ణాటకలోని హూబ్లీకి చెందిన మహ్మద్‌ షేక్‌, దక్షిణ దిల్లీలోని కల్కాజీ ఏరియాలో మంగళవారం రాత్రి 9:30 గంటలకు సమీపంలో ఓ భవనం టెర్రెస్‌పై నుంచి దూకి జువెలరీ షోరూంలోకి ప్రవేశించాడు. అక్కడ వివిధ అరల్లో అమర్చిన నగలను సంచీలో వేసుకుంటూ తెల్లవారుజామున 3 గంటల దాకా షోరూంలోనే ఉన్నాడు.
 
తర్వాత నగల సంచీతో బయటకొచ్చి ఓ ఆటోలో వెళ్లిపోయాడు. ఇంత జాగ్రత్తగా దొంగతనం చేసినా అతడి ప్రయత్నం వృధానే అయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments