Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామ్ రాజన్: ‘‘రాహుల్ గాంధీ పప్పు కాదు, తెలివైనవారు’’

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (14:27 IST)
రాహుల్ గాంధీ ఒక తెలివైన వ్యక్తి, పప్పు కాదు అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ప్రజల్లో రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రశ్నించగా ఆయన పైవిధంగా బదులిచ్చారు. దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఒక న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి పప్పు అనే ఇమేజ్ రావడం దురదృష్టకరం అని అన్నారు.
 
‘‘పప్పు అనే ముద్ర వేయడం దురదృష్టకరం. దశాబ్దాలుగా నేను ఆయనతో ఎన్నో విషయాలు చర్చించాను. ఆయన పప్పు ఏమాత్రం కాదు. అతనో తెలివైన, జిజ్ఞాస ఉన్న వ్యక్తి’’ అని ఇండియా టుడే చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో గత నెలలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఈ యాత్ర సిద్ధాంతాలపై తనకు నమ్మకం ఉందని, అందుకే యాత్రలో భాగమయ్యానని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments