Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడు పోలింగ్.. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (15:40 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 40 కేంద్రాల్లో 68 బూత్‌ల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 9800 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చునని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 19వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
 
కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన నాయకుడు శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతోంది. చివరిసారిగా 2000వ సంవత్సరంలో సోనియాగాంధీ, జితేంద్ర ప్రసాద మధ్య ఈ ఎన్నిక జరుగగా, సోనియాగాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ-గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడు కానున్నారు. చివరిసారిగా 1998లో సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

Dil Raju కార్యాలయాల్లో ఐటీ దాడుల్లోనూ అధికారులు తగ్గేదేలే, రహస్యమేమిటి?

ఛవా చిత్రంలో మహారాణి యేసుబాయి గా రశ్మిక మందన్నా

ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్

క్లైమాక్స్ సన్నివేశాల్లో నితిన్ చిత్రం తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments