Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND Vs WI విశాఖ వన్డే: ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీలు

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (16:14 IST)
తొలి వన్డేలో ఓడి, సిరీస్‌ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలవక తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగిన భారత్... విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో ధాటిగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. భారీ స్కోర్లతో కదం తొక్కారు. దీంతో భారత్ ప్రస్తుతం 36.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 220 పరుగులు చేసింది.
 
రోహిత్ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు పూర్తిచేయగా, కేఎల్ రాహుల్ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 101 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
 
వెస్టిండీస్ తన జట్టులో రెండు మార్పులు చేసింది. ఎవిన్ లూయీస్ తిరిగి జట్టులో చేరాడు. హేడెన్ వాల్ష్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఖారీ పియెరీ తొలిసారిగా వన్డే ఆడుతున్నాడు. గత మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో టీమ్ ఇండియాను ఇబ్బంది పెట్టిన వెస్టిండీస్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయినట్లు కనిపించారు. హోల్డర్, చేజ్‌లు తప్ప మిగిలిన వారందరినీ భారత బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments