Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో ప్రయాణికుడికి అత్యవసర చికిత్స చేసిన తెలంగాణ గవర్నర్

Webdunia
శనివారం, 23 జులై 2022 (13:23 IST)
వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో దిల్లీ మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.

 
గుండెల్లో నొప్పితోపాటు, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆ ప్రయాణికుడు, విమానం టేకాఫ్ అయిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విమానంలో డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అని విమాన సిబ్బంది ప్రయాణికులను అడగ్గా, వెంటనే డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించి, ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.

 
కాసేపటికి అస్వస్థతను నుంచి కోలుకున్న ప్రయాణికుడు తనకు చికిత్స అందించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు డాక్టర్ తమిళిసై చేస్తున్న ప్రాథమిక చికిత్సను ఫొటోలు తీసి ట్విటర్‌లో షేర్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యను చదివారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments