అక్రమ మైనింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన డీఎస్పీపైకి డంపర్, మృతి

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (18:41 IST)
హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారిని డంపర్‌తో తొక్కి చంపించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది. మీడియా కథనాల ప్రకారం... ‘మేవాత్ జిల్లాలోని తావడు డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్, నుహ్‌లోని అక్రమ మైనింగ్ కేసును విచారించడానికి వెళ్లారు.

 
ఇద్దరు పోలీసులతో ఆయన మంగళవారం 11.50 ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఒక డంపర్‌ను ఆపారు. పేపర్లు అడగ్గా డ్రైవర్ వేగం పెంచి డంపర్‌ను పోలీసుల కారు మీదకు ఎక్కించాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్, గన్‌మెన్ తప్పించుకోగా డీఎస్పీ సురేంద్ర మాత్రం చనిపోయారు.’ 1994లో అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా చేరిన సురేంద్ర ఆ తరువాత డీఎస్పీ స్థాయికి ఎదిగారు. మరొక నాలుగు నెలల్లో ఆయన రిటైర్ కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments