Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ వేడినీటిలో పసుపు కలుపుకుని తాగితే..? చెడు కొలెస్ట్రాల్ పరార్..

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:24 IST)
రోజూ పరగడుపున వేడినీటిలో పసుపు కలుపుకుని టీలా తాగితే చెడు కొలెస్ట్రాల్ పరారవుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగితే శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన కొవ్వు కరుగుతుంది. రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 
పసుపును నిత్యం తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనబడే సమ్మేళనం అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. క్యాన్సర్లు రాకుండా నియంత్రించడంలో పసుపు అమోఘంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి పసుపుకు ఉంది. 
 
పసుపు నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. బ్లడ్ షుగర్ అదుపులోకి వస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. చర్మాన్ని సంరక్షించే ఎన్నో గుణాలు పసుపులో ఉంటాయి. నిత్యం పసుపు కలిపిన గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

తర్వాతి కథనం
Show comments