మధుమేహానికి దివ్యౌషధం.. త్రిఫలా చూర్ణాన్ని నెయ్యి, మజ్జిగలో కలిపి తాగితే..?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (20:08 IST)
దేశంలో మధుమేహం బారిన పడేవారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఆహారంతో పాటు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే.. మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. త్రిఫలా చూర్ణంతో మధుమేహాన్ని అదుపులో వుంచుకోవచ్చు. 
 
త్రిఫల చూర్ణంతో కలిగే ప్రయోజనాలను చూద్దాం.. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. ఇది మధుమేహానికి అద్భుతమైన ఔషధం. అలాగే, అధిక రక్తపోటు, ఊబకాయం, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయలతో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.
 
కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. త్రిఫల ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. త్రిఫలాన్ని స్వచ్ఛమైన నెయ్యితో కలుపుకోవచ్చు. ఇది ప్రేగులు, ప్రేగుల గోడలను శుభ్రపరుస్తుంది. 
 
ఇది శరీరంలోని విషాన్ని తొలగించడంలో సాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. త్రిఫల చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్న భోజనం తర్వాత ఒక టీస్పూన్ త్రిఫలాన్ని ఒక కప్పు మజ్జిగలో కలిపి తాగవచ్చు. రాత్రిపూట ఒక టీస్పూన్ త్రిఫలాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments