పువ్వులతో చర్మ సౌందర్యం.. మల్లెపూల ముద్దకు చెంచా పాలు చేర్చి?

మల్లె, గులాబీ పువ్వుల వాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. పువ్వులు ముఖ చర్మానికి అందాన్ని, చర్మానికి తాజాదనాన్ని తెస్తాయి. సూర్యకిరణాలతో నల్లగా మారే చర్మానికి త

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:05 IST)
మల్లె, గులాబీ పువ్వుల వాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. పువ్వులు ముఖ చర్మానికి అందాన్ని, చర్మానికి తాజాదనాన్ని తెస్తాయి. సూర్యకిరణాలతో నల్లగా మారే చర్మానికి తిరిగి మెరుపును తేగలిగే ఔషధగుణాలు పువ్వుల్లో పుష్కలంగా వున్నాయి. ముఖ్యంగా మల్లెల్లో పొడిబారిన చర్మాన్ని మార్చగలిగే శక్తి ఉంది. చెంచా మల్లెపూల ముద్దకు చెంచా పచ్చిపాలను కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరవాత చన్నీళ్లతో కడిగేయాలి. తద్వారా చర్మం మెరుపులీనుతుంది.
 
అలాగే గులాబీ రేకులు గుప్పెడు తీసుకుని రెండు చెంచాల నీటిని కలిపి ముద్దలా నూరాలి. దీనికి చెంచా చొప్పున పాలూ, గ్లిజరిన్‌ కలిపి ముఖం, మెడకూ రాసుకోవాలి. ఇది పూర్తిగా ఆరాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే.. చర్మం మెరిసిపోతుంది. 
 
అలాగే కేశ, చర్మ సౌందర్యానికి మందారం ఎంతగానో తోడ్పడుతుంది. మందారం చర్మ కాంతిని పెంచుతుంది. ఇవి చర్మంపై ముడతలు లేకుండా నివారిస్తాయి. రెండు మందార పూల రేకులకు ఎనిమిది గులాబీ రేకులను కలిపి ముద్దలా చేసుకుని.. చెంచా పెరుగు, ముల్తానీ మట్టిని కూడా అందులో కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. తద్వారా చర్మంపై వున్న మచ్చలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments