Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో దోసకాయ రసం తాగితే..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:32 IST)
వేసవిలో కీరదోసను తీసుకోవడం ద్వారా చర్మంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కీరదోస తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. దాంతో ఒంట్లోని మలినాలు, విషపదార్థాలు బయటకు పోతాయి.కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కూడా కరిగిపోతాయి. కీరదోస రసం తాగితే చిగుళ్ల గాయాలు తగ్గిపోతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. 
 
కీర ముక్కల్ని సలాడ్స్‌ లేదా సూప్‌ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి నీటితో పాటు పీచుపదార్థం కూడా అధికంగా అందుతుంది. దాంతో తొందరగా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. డయాబెటిస్, హృద్రోగ వ్యాధులు దూరమవుతాయి. 
 
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్ దోసకాయలో ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, దోసకాయ రసాన్ని తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. దోసకాయలో ఉన్న పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments