Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగికి మాత్రమే అనుమతి.. అయోధ్య రామాలయ శంకుస్థాపనపై రామజన్మభూమి ట్రస్టు క్లారిటీ

Webdunia
బుధవారం, 29 జులై 2020 (15:18 IST)
అయోధ్యలోని రామాలయం భూమి పూజ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మినహా ముఖ్యమంత్రులకు ఆహ్వానం లేదని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజాగా ప్రకటించింది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు.

రామాలయం నిర్మాణం కోసం పోరాడిన కీలకవ్యక్తులైన ఎల్ కె అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాథ్వీ రితంబర, మాజీ సీఎం కల్యాణ్ సింగ్, జై భాన్ సింగ్ పోవాయియాలను భూమి పూజ కార్యక్రమానికి రావాలని ట్రస్టు ఆహ్వానించింది.

రామజన్మభూమి కేసును కోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాదులను కూడా ఈ ఆలయ భూమి పూజా కార్యక్రమానికి పిలిచారు.ప్రధాని మోదీ ముఖ్యఅతిధిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించారు.

15 మంది ఆలయ ట్రస్టు సభ్యులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కృష్ణ గోపాల్, ఇంద్రేష్ కుమార్, యోగా గురు బాబా రాందేవ్, జగత్ గురు రాంభద్రాచార్య, రాథే రాథే బాబా, యుగ్ పురుష్ ప్రేమానందజీ, విశ్వహిందూపరిషత్ తరపున అలోక్ కుమార్. సదాశివ్ కోక్జే, దినేష్ చంద్ర, ప్రకాష్ శర్మ, భజరంగ్ దళ్ అధ్యక్షుడు మిలింద్ పరాండీ, రాంవిలాస్ వేదాంతి, జితేంద్రనంద్ సరస్వతిలను రామాలయం భూమిపూజా కార్యక్రమానికి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments