Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్... 175 మంది ఆహ్వానితులు

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (09:42 IST)
అయోధ్య రామాలయం భూమిపూజ కోసం ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు చేరుకుంటారు. అక్కడ నుంచి అయోధ్యకు చేరుకుంటారు. 11.30గంటలకు హనుమాన్‌ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 
 
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.45 గంటల మధ్య 32 సెకెన్ల పాటు భూమిపూజ చేస్తారు. కాశీలోని చేనేత కార్మికుడు బచ్చాలాల్‌ మౌర్య రూపొందించిన అంగవస్త్రంతో మహాకృతువులో పాల్గొంటారు. భూమిపూజ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పారిజాత మొక్క నాటనున్నారు. అనంతరం శ్రీరామజన్మభూమి మందిర్‌ పేరిట స్టాంపును విడుదల చేస్తారు.
 
కాగా, కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భవ్యమైన రామాలయం శంకుస్థాపన కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరుకానున్నారు. కేవలం 175 మందికే శ్రీరామజన్మ భూమి క్షేత్ర ట్రస్టు ఆహ్వానం పంపింది. ఇందులో 135 మంది వివిధ క్షేత్రాలకు చెందిన సాధువులు ఉన్నారు. వేర్వేరు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన ప్రతినిధులున్నారు. 
 
అయోధ్య భూవివాదంలో ముస్లింల తరపున పోరాడిన ఇక్బాల్‌ అన్సారీకి ట్రస్టు తొలి ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం శ్రీరాముడి నిర్ణయం కావచ్చని అన్సారీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వేదికపై కొద్ది మంది మాత్రమేలు అతిథులు ఆసీనులు కానున్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌ మహారాజ్‌, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆసీనులు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments