అయోధ్య ఆలయ నిర్మాణ పనులు.. రుద్రాభిషేకంతో జూన్ 10 నుంచి మొదలు

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (16:43 IST)
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో జూన్ 10 నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. లంక విజయానికి ముందు శ్రీరాముడు శివారాధన చేశారని.. అందుకే రామాలయం నిర్మించే ముందు శివారాధన చేస్తామని తెలిపారు. ఈ నెల 10 నుంచి అయోధ్యలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న తరుణంలో ముందుగా.. రుద్రాభిషేకం చేసి పనులు ప్రారంభం కానున్నట్లు శ్రీరామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా రామ్ జన్మభూమి కాంప్లెక్స్ లోని శశాంక్ శేఖర్ ఆలయంలో జూన్ 10 న రుద్రాభిషేకం తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆలయ నిర్మాణానికి పునాది వేసేందుకు ఎల్ అండ్ టి సంస్థ జూన్ 10న పనులు ప్రారంభిస్తుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి. జూన్ 10న, మహంత్ కమల్ నయన్ దాస్ ఇతర సాధువులతో రుద్రాభిషేక క్రతువును ఉదయం 8:00 గంటలకు ప్రారంభిస్తారని.. ఈ ఆరాధన 2 గంటల పాటు జరుగనుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొంది. ఆ తర్వాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: టికెట్ ధ‌ర‌ను రూ.100గా ఫిక్స్ చేసిన రాకాస‌ మేక‌ర్స్‌

Varun Tej : కొరియన్ కనకరాజు కోసం కొరియన్, తెలుగు మిక్స్ సాంగ్ చేస్తున్న థమన్

Decoit Review: లాజిక్ లేని అడివి శేష్ డెకాయిట్ మూవీ - డెకాయిట్ జన్యూన్ రివ్యూ

Satyadev :రావు బహదూర్ నుంచి సత్యదేవ్, దీపా థామస్‌ పై రొమాంటిక్ సాంగ్

వదినపై రూ. 2 కోట్ల పరువు నష్టం వేసిన హీరోయిన్ హన్సిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

తర్వాతి కథనం
Show comments