మహాకూటమిదే అధికారం...!

Webdunia
రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి టైమ్స్ నౌ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ప్రకారం మహాకూటమికే ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కనున్నాయని తెలిపంది. ఆంధ్రప్రదేశ్‌లోని 42 లోక్‌సభ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 15, తెలుగుదేశం పార్టీ 15, తెలంగాణ రాష్ట్ర సమితి 5, ప్రజారాజ్యం పార్టీ 4, లెఫ్ట్ పార్టీలు చెరి ఒకటి(2), ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపు సాధిస్తాయని ఆ సర్వే వెల్లడించింది.

మొత్తం 22 స్థానాల్లో మహాకూటమి గెలిచే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే పేర్కొంది. టైమ్స్ నౌ ప్రీ పోల్ సర్వే ప్రకారం 2004 ఎన్నికలతో పోల్చి చూస్తే తెలుగుదేశం పార్టీకి పది స్థానాలు పెరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం ఐదవ విడతపోలింగ్ దశ ముగిసిన వెంటనే పలు టీవీ ఛానెళ్లు సర్వేలను విడుదల చేశాయి.

సార్వత్రిక ఎన్నికలు పూర్తిగా ముగిసే వరకూ ఎలాంటి సర్వేలు, ముందస్తు అంచనాలు ప్రకటించకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో ఇంతకాలంగా ఆయా సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలను విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ ఫలితాలతో రాష్ట్రంలోని పార్టీలన్నీకూడా కాసింత ఆనందం, కాసింత బెంగతో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతానికి లోక్‌సభ ఫలితాలతోనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేయనుందనేదానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. దీంతో బాటు ప్రధాన పట్టణాలలో బేరసారాలు, బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి మే నెల 16వ తేదీ మధ్యాహ్నానికిగాని పూర్తి నిజమైన ఫలితాలు వెల్లడయ్యేంతవరకు ఏ పార్టీ అధికార పీఠం ఎక్కనుందో, ఏ పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ ఫైళ్ళపై తొలి సంతకం చేయనున్నారో వేచి చూడాల్సిందే మరి...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ మతంలో జరిగివుంటే ఇలాగే స్పందించేవారా? పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ నాయకత్వమే కారణం : అమిత్ షా

ప్రేమ వ్యవహారం : క్రికెట్ బ్యాటుతో కొట్టి విద్యార్థిని చంపేశారు...

దారుణం, బాలికపై లైంగిక దాడి చేసి ప్రైవేట్ పార్టులో...

వామ్మో ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ ... నాలుగేళ్ళ చిన్నారికి పాజిటివ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

Show comments