నెల్లూరు- కృష్ణపట్నం రెండో హైవేకు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ సూచనలు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:17 IST)
నెల్లూరు నుంచి కృష్ణపట్నం వరకు రెండో హైవే నిర్మాణానికి సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటైన సమావేశంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రస్తుతమున్న హైవే చాలా రద్దీగా మారడంతో పాటు, పలు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే అధికారులు ప్రత్యామ్నాయ హైవే మార్గానికి అవసరమైన సూచనల కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే  గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ చక్రధర బాబు, జేసి హరేంద్ర ప్రసాద్, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గిరిధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి  మాట్లాడుతూ, ప్రస్తుతమున్న హైవే పరిస్థితిని సమీక్షించి రెండవ ప్రత్యామ్నాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. తద్వారా పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని, నెల్లూరు పరిసరాల వారికి కూడా మంచి సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, పాముల హరి, నవీన్ రెడ్డి, అవినాష్, డాక్టర్ సునీల్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments