Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ చేయూత: రూ.19వేల కోట్ల సాయం.. 23,14,342 మంది అర్హులైన..?

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:22 IST)
ఏపీ వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద రెండో ఏడాది లబ్ధిదారులకు నగదు బదిలీ చేయనున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. 
 
పేద మహిళలకు నాలుగేళ్లలో దాదాపు రూ.19వేల కోట్ల సాయం అందించే కార్యక్రమం ఈ పథకం ద్వారా చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా వరుసగా రెండవ ఏడాది కూడా 23,14,342 మంది అర్హులైన మహిళలకు రూ. 4,339.39 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నారు. ఈ సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైస్ జగన్.
 
కాగా, మంగళవారం అందిస్తున్న రూ. 4,339.39 కోట్లతో కలిపి వైఎస్సార్‌ చేయూత కింద ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొత్తం రూ. 8,943.52 కోట్లు సాయం అందించింది. ఇదిలాఉంటే.. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ప్రతీ ఏటా రూ. 18,750 చొప్పున వరసగా నాలుగేళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయం చేయనున్నారు. 
 
ఎన్నికల హామీ మేరకు సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ఈ నిధులు మహిళలకు ఎంతగానో ఆసరా అవుతాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం