ఊపందుకున్న స్థానిక స‌మ‌రం... జెడ్పీటీసీ నామినేష‌న్ల దాఖ‌లు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (17:54 IST)
ఏపీలో స్థానిక స‌మ‌రం ఊపందుకుంది. గ‌తంలో జ‌రిగిన జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో మిగిలిన స్థానాల‌కు ఇపుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పోటాపోటీగా నామినేషన్లు దాఖ‌లు చేస్తున్నాయి. 

 
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పెడన జడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా దివంగత మాజీ జడ్పీటీసీ గుడిశేవ రమేష్ సతీమణి గుడిశేవ లక్ష్మీరాణి నామినేషన్ దాఖలు చేశారు. పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ తో కలిసి, పెడనలోని వైసీపీ కార్యాలయం నుండి మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయానికి భారీ ఊరేగింపుగా తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి అయిన జడ్పీ సీఈఓ సూర్య ప్రకాశరావుకు త‌మ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 
తెలుగుదేశం ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా, వైసీపీదే అంతిమ విజ‌య‌మ‌ని త‌మ‌దేన‌ని ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేర్కొన్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ మొద‌లుకొని, గ్రామ‌స్థాయి ఎన్నిక‌ల వ‌ర‌కు అన్నింటిలో వైసీపీదే ఘ‌న విజ‌య‌మ‌ని, ఇదే పంథా కొన‌సాగుతోంద‌న్నారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ స‌మ్మ‌తిని ఓటు రూపంలో తెలియ‌జేస్తున్నార‌ని జోగి ర‌మేష్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments