Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపందుకున్న స్థానిక స‌మ‌రం... జెడ్పీటీసీ నామినేష‌న్ల దాఖ‌లు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (17:54 IST)
ఏపీలో స్థానిక స‌మ‌రం ఊపందుకుంది. గ‌తంలో జ‌రిగిన జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో మిగిలిన స్థానాల‌కు ఇపుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పోటాపోటీగా నామినేషన్లు దాఖ‌లు చేస్తున్నాయి. 

 
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పెడన జడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా దివంగత మాజీ జడ్పీటీసీ గుడిశేవ రమేష్ సతీమణి గుడిశేవ లక్ష్మీరాణి నామినేషన్ దాఖలు చేశారు. పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ తో కలిసి, పెడనలోని వైసీపీ కార్యాలయం నుండి మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయానికి భారీ ఊరేగింపుగా తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి అయిన జడ్పీ సీఈఓ సూర్య ప్రకాశరావుకు త‌మ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 
తెలుగుదేశం ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా, వైసీపీదే అంతిమ విజ‌య‌మ‌ని త‌మ‌దేన‌ని ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేర్కొన్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ మొద‌లుకొని, గ్రామ‌స్థాయి ఎన్నిక‌ల వ‌ర‌కు అన్నింటిలో వైసీపీదే ఘ‌న విజ‌య‌మ‌ని, ఇదే పంథా కొన‌సాగుతోంద‌న్నారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ స‌మ్మ‌తిని ఓటు రూపంలో తెలియ‌జేస్తున్నార‌ని జోగి ర‌మేష్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments