Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు రూ.30 కోట్లిచ్చారా..? 30 పైసల్ కూడా ఇవ్వలేదు నేనే లక్ష ఇచ్చా!!

Webdunia
సోమవారం, 30 మే 2016 (19:05 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.30 లక్షలు ఇవ్వడంతో పసుపు పార్టీలోకి జంప్ అయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మాజీ వైకాపా నేత, ప్రస్తుత టీడీపీ నేత జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరామనే కారణంతో తమపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఆ పార్టీ నేతలు తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
సోమవారం విజయవాడలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. నిజానికి సీఎం చంద్రబాబు తమకు 30 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీలో చేరడం జీర్ణించుకోలేక జగన్ పార్టీ నేతలు రూ.30 లక్షల్ని తాము తీసుకున్నట్లు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. తానే చంద్రబాబుకు లక్ష రూపాయలిచ్చానని.. పార్టీ ఫండ్‌గానే ఆ మొత్తాన్ని కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. 
 
మహానాడుకు చంద్రబాబు పడుతున్న కష్టం చూసి ఆ డబ్బిచ్చానని తెలిపారు. ఇంకా నిధుల కొరత.. రాజధాని లేని ఏపీకి చంద్రబాబు చేసే అభివృద్ధి పనుల కోసం తాము సహాయపడుతామని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments