Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిని ఎందుకు వేధించారని ప్రశ్నించాడు.. వైకాపా యువనేతను కత్తితో పొడిచేశారు..

వైఎస్సార్ కాంగ్రెస్ యువనేత సత్తార్‌బేగ్ (35) దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో మంగళవారం రాత్రి సత్తార్ బేగ్ దారుణంగా హతుడైనాడు. పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (09:06 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ యువనేత సత్తార్‌బేగ్ (35) దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో మంగళవారం రాత్రి సత్తార్ బేగ్ దారుణంగా హతుడైనాడు. పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ హుసేన్‌బేగ్ కుమారుడు సత్తార్‌బేగ్ (35) కార్పెంటర్‌గా పనిచేస్తూనే మండల వైసీపీ యూత్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అతని బావమరిది ఇమ్రాన్ అదే ఊరిలో ఓ దుకాణం నడుపుతున్నాడు. 
 
ఇమ్రాన్ దగ్గరి బంధువు కుమార్తె కాలేజీకి వెళ్లే సమయంలో.. అదే గ్రామానికి చెందిన హర్షవర్ధన్, అతడి తమ్ముడి విష్ణు, మరో యువకుడు కోతిమణి కలిసి వేధించారు. వారిని ఇమ్రాన్ బెదిరించాడు. దీంతో కక్ష పెంచుకున్న యువకులు మంగళవారం మద్యం తాగి ఇమ్రాన్‌పై రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. దీంతో ఇమ్రాన్ తన బావమరిది సత్తార్‌ను తీసుకుని యువకులను ప్రశ్నించేందుకు వెళ్లాడు. 
 
ఎందుకిలా చేశారంటూ సత్తార్ వారిని ప్రశ్నిస్తుండగానే అతని చాతిపై కత్తితో పొడిచేశారు. దీంతో అక్కడే కూలిపోయిన సత్తార్‌ను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే సత్తార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments