వైఎస్ఆర్‌సిపికి వణుకు పుట్టిస్తున్న కేకే సర్వే ఎగ్జిట్ పోల్: 2019లో వైసిపికి 135, 2024లో కూటమికి 161

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (12:59 IST)
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో తెలుపుతూ పలు సర్వే సంస్థలు జూన్ 1వ తేదీన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే వీటన్నిటిలో కేకే సర్వే వెల్లడించిన ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
 
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి 135 స్థానాలు వస్తాయంటే, 151 వచ్చాయి. అలాగే తెదేపాకు 25 నుంచి 35 స్థానాలనీ, జనసేనకి 0-3 స్థానాలు అని చెప్పారు. దాదాపుగా అలాంటి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు 2024లో కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ వెల్లడించింది. పైగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే... 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని తెలిపింది.
 
ఇప్పుడు ఇదే వైసిపిని వణుకుపుట్టించే విషయంగా మారుతోంది. గత ఎన్నికల్లో కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. అలాగే ఈ 2024 అసెంబ్లీ ఫలితాలు కూడా నిజమైతే ఏంటి అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఉత్కంఠతకు రేపటి జూన్ 4 ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments