Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతలో ప్రత్యేక హోదా ఉద్యమం : రోడ్డుపైనే విద్యార్థుల వంటా-వార్పు.. వైకాపా మద్దతు

ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నిధులింకా కేటాయించకపోవడం.. తాజాగా ప్రకటించబడిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర విభజనతో త

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (14:06 IST)
ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నిధులింకా కేటాయించకపోవడం.. తాజాగా ప్రకటించబడిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించకపోవడంతో తెలుగు ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
కేంద్ర బడ్జెట్‌లో విభజన చట్టం హామీలను విస్మరించిందని తెలుగు ప్రజలు బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కేంద్రంగా ప్రత్యేక హోదా ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు రాజకీయ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. విద్యార్థుల ప్రత్యేక హోదా ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్‌కేయూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. 
 
గురు, శుక్రవారాల్లో ఆందోళన చేపట్టారు. శుక్రవారం అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడే వంటా-వార్పు చేసి సహపంక్తి భోజనం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంతో పాటు విభజన చట్టం హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు గుంతకల్లును రైల్వే జోన్‌గా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, వైసీపీ నేతలు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments