Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాపై బాబుకు ఎందుకింత కక్ష-కేంద్రానికంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువా?: వైవీ ప్రశ్న

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇదివరకే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసందే. కాల్ మనీ విషయంలో అసెంబ్లీలో రోజా వ్యవహరించిన తీరుపై ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు.

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (16:02 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇదివరకే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసందే. కాల్ మనీ విషయంలో అసెంబ్లీలో రోజా వ్యవహరించిన తీరుపై ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే తాజాగా అసెంబ్లీలో రోజా తోటి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దురుసుగా ప్రవర్తించారంటూ ఆమెపై మరోసారి సస్పెన్షన్‌కు ప్రివిలేజ్ కమిటీ సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. 
 
టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ మార్చి 4న సమావేశమై రూపొందించిన నివేదికను గురువారం శాసనసభకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా పట్ల అధికార టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. రోజాపై చంద్రబాబుకు ఎందుకింత కక్ష అంటూ ప్రశ్నించారు. 
 
ఇప్పటికే రోజాను ఏడాది పాటు అసెంబ్లీకి దూరం చేసిన ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపుతుందని మండిపడ్డారు. రోజా సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు పాలనను ఆయన దుయ్యబట్టారు. కేంద్ర జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని చంద్రబాబు చెప్పడం ఆయన దిగుజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
 
ఓవైపు 2018నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతోన్న సీఎం.. ప్రాజెక్టు పూర్తవడానికి రూ.2800కోట్లు అవసరమని చెబుతూనే బడ్జెట్‌లో రూ.200కోట్లే కేటాయించడమేంటని ప్రశ్నించారు. బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని సమాధి చేసేశారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

తర్వాతి కథనం
Show comments