Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌తో వైకాపా ఎంపీ భేటీ... జనసేనలో చేరికే తరువాయి

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (11:57 IST)
ఏపీలో అధికార వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీ, జనసేన పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసానికి బాలశైరి వెళ్లారు. 
 
గత  2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన బాలశౌరి.. ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఆయన ఇటీవల వైకాపాకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మరుసటి రోజే జనసేనలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. 
 
అయితే, ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన చేరిక, ఇతర రాజకీయ అంశాలతో వారిద్దరు చర్చించినట్టు సమాచారం. కాగా, వైకాపా నేతలు పేర్ని నాని, జోగి రమేశ్‌లతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు హిట్ పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత

అలసట పోగొట్టుకోవడానికి సినిమాలే మార్గం: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

హిట్ పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత

అల్లు అర్జున్ ఫ్యాన్ పేరుతో టీనేజ్ యువత చేసిన వెర్రి వేషాలు

గాయకుడు మనో ఇద్దరు కుమారులపై కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

మొలకెత్తిన రాగులను తింటే మధుమేహం పరార్

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

తర్వాతి కథనం
Show comments