Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌తో వైకాపా ఎంపీ భేటీ... జనసేనలో చేరికే తరువాయి

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (11:57 IST)
ఏపీలో అధికార వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీ, జనసేన పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసానికి బాలశైరి వెళ్లారు. 
 
గత  2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన బాలశౌరి.. ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఆయన ఇటీవల వైకాపాకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మరుసటి రోజే జనసేనలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. 
 
అయితే, ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన చేరిక, ఇతర రాజకీయ అంశాలతో వారిద్దరు చర్చించినట్టు సమాచారం. కాగా, వైకాపా నేతలు పేర్ని నాని, జోగి రమేశ్‌లతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments