Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్ల‌పూడి మార్కెట్ యార్డులో ధాన్యం రైతులు ఇబ్బందిప‌డొద్దు!

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:55 IST)
ధాన్యం రైతులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని మైల‌వ‌రం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు, ఎమ్మెల్సీ తలశిల రఘరాం విజ‌య‌వాడ జెసి మాదవీలత గారికి విజ్ణప్తి చేశారు. విజ‌య‌వాడ శివారు గొల్లపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మాదవీలత  మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు, తలశిల రఘరాం సందర్శించారు. శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం వారు ధాన్యం రైతులతో మాట్లాడారు. మిల్లర్లు తరుగు పేరుతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 
రైతుల నుంచి వివరాలను సేకరించిన జెసి మాదవీలత సంబందిత మిల్లర్లతో మాట్లాడి, సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. రైతులను ఇబ్బందులను వెంట‌నే తీర్చాల‌ని, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు, ఎమ్మెల్సీ రఘరాం సంబందిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ కారంపూడి సురేష్, మండల పరిషత్ వైస్ చైర్మన్ వేమూరి సురేష్, సొసైటీ అధ్యక్షులు బోర్రా వెంకట్రావు, స్థానిక నాయకులు జాస్తి జగన్, గంగవరపు శివాజీ, గేరా సుమన్, యంపిటిసీ సభ్యులు, రైతులు, యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments