Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త స్పీకర్‌గా తమ్మినేని సీతారాం....!!

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (14:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కొత్త స్పీకర్‌గా మాజీ మంత్రి తమ్మినేని సీతారాంను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసినట్టు సమాచారం. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. 
 
ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఆయన ఎన్నికయ్యారు. పైగా, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడం ఇది ఆరోసారి. కళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం మంచి వక్త. అటు రాజకీయంగా, ఇటు పాలనపాపరంగా ఎంతో అనుభవం ఉంది.
 
దీంతో ఆయన్ను కొత్త సభాపతిగా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. మరోవైపు, ఏపీ కొత్త మంత్రివర్గం 8వ తేదీన కొలువుదీరనుంది.
 
మరోవైపు, ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే అయిన చిన్న అప్పలనాయుడికి అవకాశం ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. దీంతో స్పీకర్‌గా తమ్మినేనికి అవకాశం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments