Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో ఎమ్మెల్యే రోజాకు 'పోకిరి' పూనాడు...

రాజకీయ నాయకులంటే పంచ్ డైలాగులు మామూలే. ఎన్నికల పర్యటనలకు బయలుదేరితో ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై సెటైర్లు విసురుతూ రకరకాల డైలాగులతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వైసీపీలో ఎమ్మెల్యే రోజాకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. తెలుగుదేశం పార్టీన

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (16:27 IST)
రాజకీయ నాయకులంటే పంచ్ డైలాగులు మామూలే. ఎన్నికల పర్యటనలకు బయలుదేరితో ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై సెటైర్లు విసురుతూ రకరకాల డైలాగులతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వైసీపీలో ఎమ్మెల్యే రోజాకు వచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. తెలుగుదేశం పార్టీని జగన్ మోహన్ రెడ్డి తర్వాత తీవ్ర స్థాయిలో వైకాపా నుంచి ఇంకెవరైనా విమర్శిస్తున్నారా అంటే ఎమ్మెల్యే రోజా అని చెప్పక తప్పదు. ఆమె మాటలు అలా వుంటాయి మరి. 
 
ఇటీవలే నంద్యాల ఉప ఎన్నికలు ముగిశాయి. దాంతో ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా నటి, ఎమ్మెల్యే రోజా కాకినాడలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రంలోని ఓ డైలాగును ఆవేశంతో చెప్పారు.
 
అదేమిటంటే... "ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో... (వాడే) వారే కాకినాడ ఓటర్లు(పండుగాడు)" అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీని కాకినాడ ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ పిలుపునిచ్చారు. మొత్తమ్మీద ప్రచారంలో సినిమా డైలాగులతో రోజా బాగానే ఆకట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments