జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్పై వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. తిరుపతిలో జరిగిన అఖిలపక్ష నేతల నిరాహార దీక్షల్లో పాల్గొన్న సందర్భంగా రోజా మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్,
జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్పై వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. తిరుపతిలో జరిగిన అఖిలపక్ష నేతల నిరాహార దీక్షల్లో పాల్గొన్న సందర్భంగా రోజా మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్, టీడీపీ, బీజేపీ మద్దతిస్తున్నట్లు చెప్పి వెళ్ళిపోయారని రోజా ఫైర్ అయ్యారు. ఆపై రెండున్నరేళ్ల సమయంలో రెండు మీటింగ్లు పెట్టి డైలాగ్లు కొట్టారని ఎద్దేవా చేశారు.
ప్రజాసేవ చేయాలని, రాజకీయాల్లోకి రావాలని ఆలోచించే పక్షంలో గోడమీద పిల్లిలా ఎప్పుడో మాట చెప్పకుండా కొమరం పులిలా వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పోరాడాలని రోజా పవన్కు సలహా ఇచ్చారు. చేతనైతే ఎన్టీఆర్లా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి చూపాలని సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్ది చిన్న పిల్లల మనస్తత్వం అని.. పవన్ ప్రధాన మంత్రి మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను పవన్ కల్యాణ్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఏపీ ప్రజల చెవిలో కేంద్రం పువ్వులు పెట్టిందని ఆమె విరుచుకుపడ్డారు. టీడీపీ, బీజేపీల మేనిఫెస్టోలను చూడకుండానే పవన్ కల్యాణ్ ఆ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేశారా? అని ఆమె ప్రశ్నించారు.