Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుతో తలపై కొట్టుకున్న వైకాపా ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

కడప జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే ఒకరు తన చెప్పుతో తలపై కొట్టుకున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా... జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారిపోయారని పేర్కొంటూ

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:52 IST)
కడప జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే ఒకరు తన చెప్పుతో తలపై కొట్టుకున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా... జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారిపోయారని పేర్కొంటూ ఆయన పనికి పాల్పడ్డారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఛైర్మన్ ఎన్నిక జరుగకుండా వాయిదా పడింది. 
 
దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ 26 మంది కోరం కౌన్సిలర్లు ఎన్నికకు సిద్ధపడగా 14 మంది టీడీపీ కౌన్సిలర్లు వాయిదా వేయమని, విధ్వంసం సృష్టిస్తే ఏకపక్షంగా వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. 
 
చంద్రబాబు నీచ రాజకీయాలను అరాచక పాలనకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి దౌర్జన్య రాజకీయాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. అంతకుముందు ఆర్డీవో వినాయకం, పోలీసులు సిగ్గులేనితనానికి నిరసనగా ఎమ్మెల్యే మనస్థాపం చెంది తన చెప్పు తీసుకుని తానే తలమీద కొట్టుకున్నాడు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఆర్డీవోపై దాడిచేయకుండా వదిలేశామని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments