Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుతో తలపై కొట్టుకున్న వైకాపా ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

కడప జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే ఒకరు తన చెప్పుతో తలపై కొట్టుకున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా... జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారిపోయారని పేర్కొంటూ

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:52 IST)
కడప జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే ఒకరు తన చెప్పుతో తలపై కొట్టుకున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా... జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారిపోయారని పేర్కొంటూ ఆయన పనికి పాల్పడ్డారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఛైర్మన్ ఎన్నిక జరుగకుండా వాయిదా పడింది. 
 
దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ 26 మంది కోరం కౌన్సిలర్లు ఎన్నికకు సిద్ధపడగా 14 మంది టీడీపీ కౌన్సిలర్లు వాయిదా వేయమని, విధ్వంసం సృష్టిస్తే ఏకపక్షంగా వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. 
 
చంద్రబాబు నీచ రాజకీయాలను అరాచక పాలనకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి దౌర్జన్య రాజకీయాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. అంతకుముందు ఆర్డీవో వినాయకం, పోలీసులు సిగ్గులేనితనానికి నిరసనగా ఎమ్మెల్యే మనస్థాపం చెంది తన చెప్పు తీసుకుని తానే తలమీద కొట్టుకున్నాడు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఆర్డీవోపై దాడిచేయకుండా వదిలేశామని తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments