Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో డ్రగ్స్.. తెలుగుదేశం -వైకాపాల మధ్య కార్టూన్ల యుద్ధం

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (20:13 IST)
drugs capital
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ చర్చల్లో వైజాగ్‌లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ గురించే ప్రాధాన్యత వుంటోంది. ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు వాడుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఏపీని డ్రగ్ క్యాపిటల్‌గా మార్చేశారనీ, డ్రగ్స్‌ వ్యాపారం వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతల హస్తం ఉందని టీడీపీ వర్గాలంటున్నాయి. 
 
సరుకులు తెచ్చినట్లు అనుమానిస్తున్న ప్రైవేట్ కంపెనీ వెనుక టీడీపీ, బీజేపీ నేతల బంధువుల హస్తం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. డ్రగ్స్ ఆపరేషన్ గురించి ఈ తీవ్రమైన రాజకీయ యుద్ధం మరింత వేడెక్కుతుండగా టీడీపీ, వైసీపీ పరస్పరం కార్టూన్ దాడి ప్రారంభించాయి. 
 
టీడీపీని తెలుగు డ్రగ్స్ పార్టీ అని వైసీపీ కార్టూన్లు చెబుతున్నాయి. ఈ కార్టూన్లలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పురందేశ్వరి యానిమేషన్ వెర్షన్లు ఉన్నాయి. ఇక వైకాపా యువజన కొకైన్ పార్టీ అని, ఈ కార్టూన్లలో వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిల యానిమేషన్లు ఉన్నాయి.
 
దీనిని బట్టి తమ ప్రత్యర్థులపై నిందలు మోపడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు పార్టీలు నిజంగానే తహతహలాడుతున్నాయని స్పష్టంగా గమనించవచ్చు. మరి దీనివెనుక వాస్తవంగా ఎవరున్నారన్నది విచారణలో తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments