Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో డ్రగ్స్.. తెలుగుదేశం -వైకాపాల మధ్య కార్టూన్ల యుద్ధం

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (20:13 IST)
drugs capital
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ చర్చల్లో వైజాగ్‌లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ గురించే ప్రాధాన్యత వుంటోంది. ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు వాడుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఏపీని డ్రగ్ క్యాపిటల్‌గా మార్చేశారనీ, డ్రగ్స్‌ వ్యాపారం వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతల హస్తం ఉందని టీడీపీ వర్గాలంటున్నాయి. 
 
సరుకులు తెచ్చినట్లు అనుమానిస్తున్న ప్రైవేట్ కంపెనీ వెనుక టీడీపీ, బీజేపీ నేతల బంధువుల హస్తం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. డ్రగ్స్ ఆపరేషన్ గురించి ఈ తీవ్రమైన రాజకీయ యుద్ధం మరింత వేడెక్కుతుండగా టీడీపీ, వైసీపీ పరస్పరం కార్టూన్ దాడి ప్రారంభించాయి. 
 
టీడీపీని తెలుగు డ్రగ్స్ పార్టీ అని వైసీపీ కార్టూన్లు చెబుతున్నాయి. ఈ కార్టూన్లలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పురందేశ్వరి యానిమేషన్ వెర్షన్లు ఉన్నాయి. ఇక వైకాపా యువజన కొకైన్ పార్టీ అని, ఈ కార్టూన్లలో వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిల యానిమేషన్లు ఉన్నాయి.
 
దీనిని బట్టి తమ ప్రత్యర్థులపై నిందలు మోపడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు పార్టీలు నిజంగానే తహతహలాడుతున్నాయని స్పష్టంగా గమనించవచ్చు. మరి దీనివెనుక వాస్తవంగా ఎవరున్నారన్నది విచారణలో తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments