Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసాభాసగా మున్సిపల్ సమావేశం...నేతల బాహాబాహీ..!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (12:01 IST)
తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలో బుధవారం ఉదయం ప్రారంభమైన మున్పిసల్ కార్పోరేషన్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సభలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు ఒకరిపై ఒకరు తలపడ్డారు. తెలుగుదేశం, వైకాపా నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
ఆ వాగ్వాదం విర్రవీగడంతో ఒకరిపై ఒకరు బాహాబాహీ తలపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అప్పారావుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఇరు పార్టీలు మధ్య ఉద్రిక్తత తలెత్తింది. దీంతో అక్కడ చోటు చేసుకున్న తోపులాట కొట్టుకునే దాకా వచ్చింది.
 
సమావేశంలో సభ్యుల బాహాబాహీతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ రజనీ శేషసాయి సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లారు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు కూడా ఒకరినొకరు తోసుకున్నారు.

అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ మురళీ జోక్యం చేసుకుని సమావేశానికి వచ్చిన ఇతరులను బయటకు పంపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణ పడుతున్న సభ్యులను కట్టడిచేశారు. ఈ సంఘటన పార్టీ వర్గాలలో కలకలం రేపింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments