Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరజీవి పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి.. వైకాపా నేతల డిమాండ్

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (11:38 IST)
తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని పోరాడి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములకు భారతరత్నఇవ్వాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
 
నెల్లూరు నగరంలో శనివారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షడు ఎన్. ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటో తేదినే నిర్ణయించాలని సీఎంను కోరారు. జూన్ 2వ తేదీన జరుపుకోవాలనే ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టారు. అవతరణ దినోత్సవం విషయంలో మరోసారి ఆలోచించాలని మేకపాటి ఈ సందర్భంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
 
అనంతరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments