Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (12:31 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత బుధవారం ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని హోం మంత్రిని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని సునీతకు హోం మంత్రి భరోసా ఇచ్చారు. 
 
ఈ భేటీలో వివేకా హత్య తదనంతర పరిణామాలను హోం మంత్రికి డాక్టర్ సునీత వివరించారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షులను కూడా బెదిరించి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని తెలిపారు. 
 
దీనిపై హోం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రస్తుతం కేసు సీబీఐ విచారణలో ఉందన్నారు. అయితే, కేసు విచారణకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments