Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ అవినాశ్ పైన అందుకే నేను పోటీ చేస్తున్నా : వైఎస్ షర్మిల

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (20:00 IST)
తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తన చిన్నాన్ని విషయంలో హంతకులతో వున్నారనీ, ఆయన కడప నుంచి మళ్లీ గెలవరాదన్న ఏకైక లక్ష్యంతోనే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో షర్మిలను కడప లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించింది.

అభ్యర్థుల జాబితాను ఆమె విడుదల చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, హంతకుడు అవినాశ్‌ను ఎంపీ కానివ్వకపోవడమే తన లక్ష్యమని తెలిపారు. తనను వైఎస్ఆర్ వారసురాలిగా వైఎస్ఆర్ బిడ్డగా ప్రజలంతా ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ నిర్ణయం సులువైంది కాదని తనకు తెలుసన్నారు. కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. 
 
"నా అనుకున్న వాళ్ళను జగనన్న నాశనం చేశారు. చిన్నాన్న వివేకాను చంపించిన వారిని జగనన్న వెనకేసుకొస్తున్నారు. తద్వారా హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలిచారు. చిన్నాన్న హంతకులను జగన్ కాపాడుతున్నారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాశ్‌ను టిక్కెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాను.

కడపలో అతడు మళ్లీ గెలవకూడదనే నేను పోటీకి దిగుతున్నా. అవినాశ్‌ను ఎంపీ కానివ్వకపోవడమే నా లక్ష్యం. గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయం కోసం ఉపయోగించుకుంది. నేను కడప ఎంపీగా నిలబడాలనేది చిన్నాన్న కోరిక. ఆయన కోరిక నెరవేర్చేందుకే కడప ఎంపీ బరిలో దిగుతున్నాను. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని షర్మిల పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments