Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేయడమంటే ఇదేనేమో ... కూటమి సర్కారుపై వైఎస్.షర్మిల ధ్వజం

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (15:13 IST)
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇపుడు వారికి తీరని అన్యాయం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు ఆందోళన బాటపడుతుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మాట ఇచ్చి మోసం చేయడం అంటే ఇదేనేనని, తమ గోడు వినిపించాలనుకున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. వారి గొంతు నొక్కి, ఆందోళనలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. అంగన్‌వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వారిని వెంటనే చర్చలకు ఆహ్వానించి వారి కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 
 
ముఖ్యంగా, అంగన్‌వాడీ ప్రధాన డిమాండ్లు అయిన నెలకు గౌరవ వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలని, మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల పదోన్నతిపై నిర్ధిష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, పెండింగ్ పోస్టులను భర్తీ చేయాలని, విధి నిర్వహణలో అంగన్‌వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు అంత్యక్రియల కోసం రూ.20 వేలు ఇవ్వాలని, వీటితో పాటు మరో 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments