Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల!

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా (ఏపీ పీసీసీ చీఫ్)గా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల నియమితులుకానున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు ఆమె శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని చెబుతున్నారు. 
 
ఓ వైపు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతున్న సమయంలోనే... రేపు ఆమె దేశ రాజధానిలో అడుగు పెట్టనున్నారని డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కావడంతో ఇదే రోజు షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి అధిష్ఠానం ఆసక్తిగా ఉందని అంటున్నారు. 
 
అధిష్ఠానం పూర్తిగా చర్చించిన తర్వాత... పిలుపు రాగానే ఆమె రేపు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. షర్మిలను జాతీయస్థాయిలో ఏఐసీసీలో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు, షర్మిల భర్త అనిల్ కుమార్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోవడంతో ఊహాగానాలకు బలం చేకూరుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments