11 సీట్లు వచ్చినా మీరు అసెంబ్లీకి వెళ్లలేదు.. మాకు సీట్లు రాక వెళ్లలేదు : వైఎస్ షర్మిల (Video)

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (14:27 IST)
వైకాపాను, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపాకు, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం తేడాలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు 11 సీట్లు వచ్చిన వైకాపా హాజరుకావడం లేదు. అలాగే, ఒక్క సీటురాని కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీనిపై షర్మిల స్పందిస్తూ, మీది మాది ఒకటే కథ. 11 అసెంబ్లీ సీట్లు వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా మీకు.. సీట్లు ఏమీ రాని మాకు తేడా ఏముంది? అసెంబ్లీకి ఎందుకు వెళ్లలేదంటే సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ను ఇన్‌సఫిషియంట్ అంటున్నారు? కాంగ్రెస్ వల్ల ఎదిగి కాంగ్రెస్‌ పార్టీనే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ అర్హత మీకు లేదు అంటూ జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఘాటుగా కౌంటరిచ్చారు. 
 
అంతేకాకుండా గత ఎన్నికల్లో జగన్ పార్టీకి 38 శాతం ఓటు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనపుడు, వైకాపాకి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఏం లేదన్నారు. 38 శాతం ఓట్ షేర్ పెట్టుకుని అసెంబ్లీకి పోనీ వైకాపాని నిజానికి ఒక ఇన్‌సఫిసియంట్ పార్టీగా మార్చింది జగన్మోహన్ రెడ్డేనని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షానన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని, అసమర్థ వైకాపా ఇవాళ రాష్ట్రంలో అసలైన ఇన్‌సిఫిసియంట్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments