Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి టూర్ షెడ్యూల్ ఇదే...

Webdunia
మంగళవారం, 28 మే 2019 (14:01 IST)
వైసీపీ అఖండ విజయం సాధించిన నేపధ్యంలో మరికొద్ది గంటల్లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు జగన్ నేడు తిరుమలకు రానున్నారు. ప్రత్యేక విమానంలో నేటి సాయంత్రం 6.30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. 
 
ఈ రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్‌లో బసచేస్తారు. రేపు ఉదయం 8.15 గంటలకు శ్రీవారిని దర్శించుకుని 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి 11.00 గంటలకు కడప చేరుకుంటారు. 11.30 నుండి 11.45 వరకు కడప నగరంలోని ప్రఖ్యాత పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం 12.15 గంటలకు కడప నుండి పులివెందులకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తారు. 
 
అక్కడ సీఎస్ఐ చర్చిలో కుటుంబసభ్యులతో కలిసి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత నుంచి 1.30 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని  దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 4.30 వరకు ఇడుపులపాయలో గడిపి 4.30 గంటలకు ఇడుపులపాయ నుంచి కడప విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానం ద్వారా సాయంత్రం 6 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి 7.30 నిమిషాలకు తాడేపల్లిలో తమ నివాసానికి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments