Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ ప్రాంతాల్లో జగన్ టూర్ : చంద్రబాబు సర్కారుపై ఫైర్!

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (13:02 IST)
హుదూద్ బాధిత ప్రాంతాల్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. శనివారం విశాఖలోని తుమ్మపాల ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చెరకు రైతులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వం సహకార రంగంపై వ్యవహరిస్తున్న తీరుపై జగన్ విమర్శలు గుప్పించారు. 
 
లాభాల్లో నడుస్తూ చెరకు రైతులకు అండగా నిలుస్తున్న సహకార చక్కెర ఫ్యాక్టరీలను నష్టాల బాట పట్టించడం టీడీపీ సర్కారుకు అలవాటేనని జగన్ ఆరోపించారు. నష్టాల బాట పట్టిన తర్వాత ఆయా చక్కెర ఫ్యాక్టరీలను తక్కువ ధరలకే తెగనమ్మడం కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మామూలేనని విమర్శించారు. 
 
తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని కేవలం రూ.4 కోట్లకు విక్రయించేందుకు టీడీపీ ప్రభుత్వం యత్నించగా, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారని వెల్లడించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments