Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే తంతు.. కొనిపారేశారన్న జగన్.. సింహం సింగిల్‌గానే..?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కొనేసిందని జగన్ ఆరోపించారు. తద్వారా ప్రజ

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (16:48 IST)
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కొనేసిందని జగన్ ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేసిందని జగన్ ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ఆర్ సిపి గట్టిపోటీ ఇచ్చిందన్నారు. అధికారికంగా టిడిపి గెలిచినా నైతిక విజయం తమదేనని ఆయన చెప్పారు.
 
డబ్బులు చల్లి గెలుచుకోవడం ఓ గెలుపేనా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులను అద్భుతంగా కొనుగోలు చేశాడని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ టిడిపి ఎమ్మెల్యే పట్టుబడిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే తంతు జరిగిందని చెప్పారు.
 
మరోవైపు వైకాపా నేత రోజా కూడా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. నిషేధానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏడాది తరువాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచిందని అన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని, ప్రజా క్షేత్రంలో గెలిచి తీరుతామన్నారు. 
 
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే చంద్రబాబు మళ్లీ ఏపీలో కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకున్నారన్నారు. రూ.300 కోట్లు ఖర్చుపెట్టి ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించింది సీఎం చంద్రబాబే అని దుయ్యబట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments